విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి* *ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్*

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి*  *ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్*

అచ్యుతాపురం(జనం న్యూస్):అచ్యుతాపురం, మోసయ్య పేట ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్, కబడ్డీ, కోకో క్రీడా పోటీలను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఓటమి తోనే విజయం చేకూరుతుందని, ఓటమికి తలవగ్గకుండా విజయం

సాధించడానికి కృషి చేయాలన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నా చదువుతోపాటు క్రీడలకు కూడా రాణించాలని, అచ్యుతాపురం మండలంలోని క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. యువత క్రీడల్లో రాణిస్తే వారి జ్ఞాపకశక్తి పెరుగుతుందని తద్వారా చదువుల్లో బాగా రాణిస్తారని ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.