శివ్వంపేట మండలప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ అజీజ్ ఏకగ్రీవ ఎన్నిక

శివ్వంపేట మండలప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ అజీజ్ ఏకగ్రీవ ఎన్నిక

 ఉపాధ్యక్షుడు బి నర్సింలు గౌడ్ సలహాదారులుగా కే సత్యనారాయణ గౌడ్ డి సంతోష్..

 జనం న్యూస్ సెప్టెంబర్9.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

తమపై  నమ్మకంతో  ప్రెస్ క్లబ్  అద్యక్షునిగా ఎన్నుకున్న  సభ్యుల నమ్మ కాని వమ్ము  చేయాకుండా  జర్నలిస్టుల అభివృద్ధికి  కట్టుబడి ఉంటానని  ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నూతన ఎన్నికైన అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ని  ఓ ఫంక్షన్ హాల్ లో అదివారం   శివ్వంపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా అబ్దుల్ అజీజ్, ప్రధాన కార్యదర్శిగా గోవిందరాజ్ చారి, గౌరవఅధ్యక్షుల వెంకటేష్, ఉపాధ్యక్షునిగా  బి.నర్సింలు  గౌడ్, కార్యదర్శిలు గా  ఆర్ నగేష్, కోండ సంపత్ కుమార్ చారి, ఎస్ వేంకటేష్,కోశాధికారిగా షబ్బీర్ ప్రచార కార్యదర్శిగా ఆనంద్, సలహాదారులుగా డి, సంతోష్, కే,సత్యనారాయణ గౌడ్ కార్యవర్గ సభ్యులుగా గణేష్ కుమార్ చారి, ఏం డీ ఖదీర్,బాలు నాయక్,ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సందర్భంగా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి తన వంతు  కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పద్మ చారి, ఆర్.శ్రీకాంత్, పి.సందీప్, ప్రవీణ్ వెంకటేష్ ఎన్నికయ్యారు.