24న రామాచారికి కిన్నెరబాలు పురస్కారం

24న రామాచారికి కిన్నెరబాలు పురస్కారం

హైదరాబాద్ రవీంద్రభారతిలో అవార్డు ప్రదానం చేయనున్న కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్..

అవార్డు అందుకోనున్న రామాచారి శివ్వంపేట మండల వాసి..

 జనం న్యూస్ సెప్టెంబర్23.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పెద్దగొట్టిముక్కుల గ్రామానికి చెందిన కొమండూరి రామాచారికి ఈనెల 24న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించే పద్మవిభూషణన్ డాక్టర్ పండితారాద్యుల బాలసుబ్రమణ్యం చతుర వర్థంతి కార్యక్రమంలో కిన్నెర - బాలు పురస్కారం ప్రదానం చేయనున్నట్లు ఆయన బాల్య మిత్రులు జిన్నారం పెద్దగోని సూర్యం కుమార్ గౌడ్  మీడియాకు తెలియజేశారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్, కిన్నెర కల్చరర్ అండ్ ఎడ్యూకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ గాయకులు రామాచారికి అందజేసే కిన్నెర బాలు పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా,మాజీ ప్రభుత్వ సలహాదారులు, రిటైర్డ్ ఐఏఎస్  అధ్యక్షులుగా, విశిష్ట అతిథులుగా సినీ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్,గౌరవ అతిథులుగా డాక్టర్ వొలేటి పార్వతీశం,ఆత్మీయ అతిథులుగా భోగరాజు మూర్తి హాజరుకానున్నారని ఆయన తెలిపారు. శివ్వంపేట మండలానికి చెందిన రామాచారి అంచలంచెలుగా ఎదిగి ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులుగా ఎదిగి కిన్నెర బాలు పురస్కారం అందుకోబోతున్నారని మండల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.