కన్నకొడుకునే చంపేసిన తల్లి

కన్నకొడుకునే చంపేసిన తల్లి

జనం న్యూస్, అక్టోబర్ 30 విజయనగరం

నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లే ఆ బిడ్డ పాలిట

యమపాశమైంది. భర్తతో జరిగిన గొడవ కారణంగా

బయటకి వెళ్లిన తల్లి వెంటపడ్డాడనే కారణంగా

కుమారుడిని సంపులో తోసేసి శనివారం చంపింది.

ఎస్.కోట మండలానికి చెందిన దొరబాబు, మణి

దంపతులు విశాఖ గాజువాకలో ఓ అపార్ట్మెంట్లో

పనిచేస్తున్నారు. భార్య, భర్తల గొడవల నేపథ్యంలో ఐదేళ్ల

కుమారుడు వేదాంత్ బలయ్యాడు. ఈ ఘటనపై స్థానిక

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.