గుడిలో పూజ మొదలెట్టగానే నాగుపాము పట్టుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చిన మహిళ

గుడిలో పూజ మొదలెట్టగానే నాగుపాము పట్టుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చిన మహిళ

జనం న్యూస్: హనుమాన్‌కు హారతి ఇవ్వడం ప్రారంభించగానే.. ఆమె చేతిలో నాగుపాముతో ముందుకు వచ్చింది. తొలుత అక్కడున్న భక్తులంతా ఆమెను చూసి భయపడ్డారు.హోలీ పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్ సరిహద్దు చింద్వారా జిల్లాలో ఉన్న జామ్ సావాలి హనుమాన్ ఆలయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. గుడిలో మహా హారతి చేస్తున్న సమయంలో ఓ మహిళ అకస్మాత్తుగా తన చేతులకు పామును చుట్టుకుని ముందుకు వచ్చింది. ఆపై అక్కడే దేవుడ్ని స్మరిస్తూ నాట్యం చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాము మహిళకు ఎలాంటి హాని కలిగించలేదు. కొంత సమయం తర్వాత ఆమె పామును వదిలివేసింది.

కింద లింక్ క్లిక్ చేసి వీడియో చూడండి 

https://twitter.com/indiatvyogendra/status/1633693661312720897?s=20

ఈ సంఘటనను అక్కడున్నవారు కెమెరాలో బంధించారు. ఇక్కడ హనుమంతుని విగ్రహం పడుకునే స్థితిలో ఉంది. విగ్రహం నాభి నుండి నీరు నిరంతరం ప్రవహిస్తుంది. ఉదయం, సాయంత్రం హారతికి హాజరై హనుమంతుని నాభి నుండి వచ్చే నీటిని తీసుకుంటే మానసిక వ్యాధులు నయమవుతాయని, దుష్టశక్తులను దూరంగా పారిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అటువంటి సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ఇక్కడ ప్రత్యేకంగా జాతర నిర్వహిస్తారు.మహా హారతి సందర్భంగా మహిళ చేతికి పాము చుట్టుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అటువంటి ఘటనలు దైవిక శక్తుల సమక్షంలో జరుగుతాయని పూజారులు చెబుతున్నారు. ఈ సంఘటన సందర్శకులలో ఉత్సుకతను రేకెత్తించింది.