డీసీఎం - లారీ ఢీకొని ఒకరికి గాయాలు.

డీసీఎం - లారీ ఢీకొని ఒకరికి గాయాలు.

మగ్దుంపూర్ శివారులో ఘటన..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

 జనం న్యూస్ అక్టోబర్4.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

మండలంలోని మగ్దుంపూర్ గ్రామ శివారులో లారీ -డీసీఎం ఢీకొన్న సంఘటనలో శుక్రవారం డీసీఎం డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. తూప్రాన్ నుండి నర్సాపూర్ వెళ్తున్న లారీ నెంబర్ కేఎ 56 5514 ను ఎదురుగా వచ్చిన డీసీఎం టీఎస్ 02 యూసీ 9866 గలది బలంగా ఢీకొట్టడంతో డ్రైవర్ కు గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డీసీఎం - లారీ నడిరోడ్డుపై ఢీకొనగా వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జాం అయిన విషయం తెలుసుకున్న శివ్వంపేట పోలీసులు హుటాహుటిన ఘటన స్టలికి చేరుకుని వాహనాల రాకపోకలను పునరుద్దరించారు.  గాయపడిన డీసీఎం డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగినది