పట్టపగలు అందరి ముందూ మహిళను కొట్టుకుంటూ తుపాకులతో ఈడ్చుకెళ్ళిన దుండగులు (వీడియో చూడండి)

జనం న్యూస్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు ఓ మహిళను దుండగులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ప్రజల కళ్ల ముందే ఈ దారుణం జరిగింది. దుండగులు చేతిలో తుపాకీ, కర్రతో మహిళను బెదిరించి ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆ మహిళ సాయం కోసం రోదించింది. అతన్ని ఒంటరిగా వదిలేయమని ఏడుస్తుంది. అయితే ఆ మహిళది అరణ్య రోదన. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగులు మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యం భయానకంగా ఉంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రజలను దుండగులు తుపాకీతో బెదిరించారు. అంతేకాదు కర్రలు కూడా ఊపారు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన ఓ వృద్ధురాలు సహాయం కోసం కేకలు వేస్తున్న దృశ్యం కూడా కెమెరాలో చిక్కింది. దుండగుల తుపాకీకి భయపడి జనం మహిళను రక్షించేందుకు ముందుకు రాలేదు. మౌన వీక్షకులుగా అక్కడే నిలబడ్డారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది.