పెళ్ళిలో సిలిండర్ పేలి 7మంది మృతి... 60 మందికి గాయాలు..

పెళ్ళిలో సిలిండర్ పేలి 7మంది మృతి... 60 మందికి గాయాలు..

జనం న్యూస్: పెళ్లి సంద‌డితో క‌ళ‌క‌ళ‌లాడుతున్న ఆ ఇల్లు ఒక్క‌సారిగా శ‌వాల గుట్ట‌లా మారింది. ఊహించ‌ని విధంగా జ‌రిగిన ఘ‌ట‌న ఆ ఇంట పెను విషాదాన్ని నింపింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతిచెంద‌గా, 52 మంది గాయాల‌పాల‌య్యారు. రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గురువారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బరాత్‌కు ముందు పెళ్లి కుమారుడి ఇంటి వ‌ద్ద‌ అంద‌రూ సంద‌డిగా క‌బుర్లు చెప్పుకుంటూ టీ తాగుతుండ‌గా, ఒక్క‌సారిగా విస్పోట‌నం సంభ‌వించింది. స్టోర్ రూమ్‌లోని గ్యాస్ సిలిండ‌ర్ లీక‌వ‌డంతో ఒక్క‌సారిగా పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మ‌రో 52 మంది గాయ‌ప‌డ‌గా వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. గాయ‌ప‌డిన‌వారిలో వ‌రుడు, అత‌ని త‌ల్లిదండ్రులు ఉన్నారు. వీరు ముగ్గురూ తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్టు తెలిసింది. ఈ దుర్ఘ‌ట‌న స‌మాచారం అందుకున్న రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శుక్ర‌వారం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. బాధితుల‌కు స‌త్వ‌రం మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్ప‌త్రి సిబ్బందిని ఆదేశించారు. ఈ ఘ‌ట‌న స‌మాచారం అందుకున్న పోలీసు అధికారి డుంగ‌ర్ సింగ్ హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నాడు. మంట‌ల్లో చిక్కుకున్న ఇంటిలో మ‌రికొన్ని గ్యాస్ సిలిండ‌ర్లు ఉన్న‌ట్టు బాధితుల ద్వారా తెలుసుకున్న ఆ అధికారి.. అవి కూడా పేలితే మ‌రింత ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని భావించి.. ప్రాణాల‌కు తెగించి సాహ‌సానికి దిగాడు. ద‌గ్ధం అవుతున్న ఇంట్లోకి దూకి.. మంట‌లు అంటుకున్న సిలిండ‌ర్ల‌ను బ‌య‌టికి తీసుకొచ్చాడు. సింగ్ చూపిన తెగువ గురించి తెలుసుకున్న సీఎం గెహ్లాట్ అత‌న్ని ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆ అధికారికి ప‌దోన్న‌తి ఇస్తున్న‌ట్టు ఈ సంద‌ర్భంగా సీఎం ప్ర‌క‌టించారు.