బావిలో పడి వ్యక్తి మృతి... కారణం ఏంటి అంటే.

బావిలో పడి వ్యక్తి మృతి... కారణం ఏంటి అంటే.

జనం న్యూస్ (జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి) 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని, మాచునూర్ గ్రామంలో , మద్యానికి ( త్రాగుడుకు ) బానిసై, మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి, నుల్కా శ్రీనివాస్, తండ్రి నర్సప్ప, వయస్సు 35 సంవత్సరాలు, కులం ఎస్సీ ( మాల ) వృత్తి రంగులు వేయటం. అన్న ఆచూకీ కోసం నుల్క బాబీ, తన తల్లి, పారమ్మ, నుల్క శ్రీనివాస్ కొరకు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, తేదీ 8 ఆగస్టున అందాజా ఉదయం 11 గంటలకు, అదే గ్రామానికి చెందిన బ్యాగరి నర్సిములు, తండ్రి తుల్ జప్ప, వీరి వ్యవసాయ బావిలో పడి, శవమై తేలడంతో ఇట్టి విషయమై నుల్క బాబీ, పోలీసులకు ఫిర్యాదు చేశాడని, తన అన్న నుల్కా శ్రీనివాస్ కు, మతిస్థిమితం లేదని, త్రాగుడుకు బానిసై, అట్టి భావి ప్రక్క నుండి వెళుతూ, ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మరణించి ఉండవచ్చని, అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిజ నిర్ధారణ చేసి, తమకు న్యాయం చేయాలని దరఖాస్తులో పేర్కొన్నాడు.