మాన్యశ్రీ కాన్షీరామ్ 19వ వర్ధంతిని జయప్రదం చేయాలి.

మాన్యశ్రీ కాన్షీరామ్ 19వ వర్ధంతిని జయప్రదం చేయాలి.

జనం న్యూస్ 09 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ,గద్వాల అసెంబ్లీ ఇన్చార్జి  బండారి ఎస్ రాజు,జోగులాంబ *గట్టు మండల కేంద్రం సామాజిక పరివర్తనకు నాంది పలికిన మహనీయుల ఆలోచన విధానంతో బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసిన పార్టీ  వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరామ్ గారి 19వ వర్ధంతిని జయప్రదం చేయాలనీ బీఎస్పీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జ్  బండారి ఎస్ రాజ్   నేడు ఒక ప్రకటనలో కోరారు. ముఖ్యంగా దేశంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ సామాజిక వర్గం కోసం కాన్షీరామ్ గారు 1984. సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోని బహుజనుల కోసం పార్టీని ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్లో నాలుగు సార్లు మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసిన ఘనత కాన్షీరామ్ గారికి దక్కుతుందన్నారు. ఈ నెల 9వ తేదీన  ఆయన వర్ధంతి సందర్భంగా బుధవారము జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న హరిత టూరిజంలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, రాష్ట్ర ఈసీ నెంబర్ గణపురం కృష్ణ గార్లు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని మండలాల నుండి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భాంసెఫ్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చిన్న,అఖిల్, అర్జున్ పాల్గొన్నారు