రైతులకు పెట్టుబడి సాయం అందేవరకు పోరాడతాం

రైతులకు పెట్టుబడి సాయం అందేవరకు పోరాడతాం

బీఆర్ఎస్ శివంపేట మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్..


కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని రమణ గౌడ్  మండిపాటు...

 జనం న్యూస్ అక్టోబర్19.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

రైతులందరి ఖాతాలలో పంటపెట్టుబడి పథకానికి సంబందించిన రైతు భరోసా డబ్బులు వేసే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ రైతులకు కెసిఆర్ ప్రభుత్వం ముష్టి 10 వేల రూపాయలు రైతుబందు ఇస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుభరోసా ద్వారా ఎకరాకు 15 వేల రూపాయలను ప్రతి రైతుకు తప్పకుండ అందిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి ఇప్పుడు సబ్ కమిటీల పేరుతో రైతులకు రైతుభరోసా ఎగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలలు కావస్తున్న ఇంతవరకు రైతులకు పంటపెట్టుబడి సాయం అందించకపోవడం సిగ్గుచేటని శివంపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులురమణ గౌడ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాసంగి, వానాకాలం రెండు పంటలకు కూడ రైతులకు రైతుభరోసా సాయం అందించక, రైతు రుణమాఫీ కొందరికే చేసి అన్నదాతలను ఆగం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకిచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడ ఎకరాకు 15 వేల రూపాయల రైతుభరోసా సాయం అందించడంతో పాటు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని ప్రతి రైతుకు వర్తింపజేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ, రైతుభరోసా డబ్బులు అందించే వరకు కూడ అన్నదాతల పక్షాన నిలబడి ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తామని శివంపేట  మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ హెచ్చరించారు.