అందరూ ప‌ర్యావ‌ర‌ణ‌హిత మ‌ట్టి గణపతులనే పూజించాలి

అందరూ ప‌ర్యావ‌ర‌ణ‌హిత మ‌ట్టి గణపతులనే పూజించాలి

గురాన అయ్యలు సతీమణి రాధిక
జనం న్యూస్ 03 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
జిల్లా కేంద్రం లో గల విజయదుర్గ యూత్ సొసైటీ మూడవ వార్షికోత్సవం సందర్భంగా  జనసేన నేత గురాన అయ్యలు సతీమణి రాధిక  ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం స్థానిక జీఎస్ఆర్ హోటల్ వద్ద ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గురాన రాధిక మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యమిద్దామని, మండ‌పాల్లో, ఇళ్ళ‌లో కూడా ప‌ర్యావ‌ర‌ణ‌హిత వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను ప్ర‌తిష్టించి… పూజిద్దామని పిలుపునిచ్చారు.వినాయక మట్టి విగ్రహాలు పంపిణి అనంతరం కేక్ కటింగ్ చేసారు. ఈ కార్యక్రమంలో విజయ దుర్గ యూత్ సొసైటీ ప్రెసిడెంట్ కేశవపట్నం చంద్రిక, జయలక్ష్మి, సభ్యులు జ్యోతి హిమశ్రీ, స్నేహశ్రీ,స్వాతి హారిక,సాయి షణ్ముక్ ,స్వీటీ, విజయనగరం యూత్ ఫౌండర్ షేక్ ఇల్తామాష్ ,రఘు తదితరులు పాల్గొన్నారు.