.చిట్యాల ఐలమ్మ వర్ధంతి

.చిట్యాల ఐలమ్మ వర్ధంతి

జనం న్యూస్ సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రతినిధి దినేష్

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు.ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ముస్తాబాద్ పట్టణంలో  మండల రజక సంఘం అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆమె విగ్రహాలు,చిత్రపటాలకు మండల ప్రజా ప్రతినిధులు పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మకు స్వరాష్ట్రంలో జయంతి,వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని, హైదరాబాద్ నడి ఒడ్డున ట్యాంక్ బండి పై ఆమె విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరు  శ్రీనివాస్ ,సందుపట్ల అంజిరెడ్డి ,మాజీ ఎంపీటీసీలు  గజ్జల రాజు ,శ్రీనివాస్ ,రజక సంఘం  అఖిల భారతీయ జిల్లా అధ్యక్షులు అక్కరాజు, పరుష రాములు ,సుద్దాల దేవయ్య, తలారి నరసింహులు, కోల కృష్ణ రజక సంఘం నాయకులు భాను ,శరవయ్య, డిటి బాలయ్య, ఆకారం శ్రీనివాస్ ,మాచర్ల బాలయ్య, రాజు, రంజాన్ రాజలింగం, సుంచు మల్లేష్, రజక సంఘం కుల బాంధవులు ,తదితరులు పాల్గొన్నారు.