ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ జన్మదిన వేడుకలు

ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ జన్మదిన వేడుకలు

(జనం న్యూస్) సెప్టెంబర్ 6 కల్లూరు మండలం రిపోర్టర్ సురేష్ :- కల్లూరు మండల పరిధిలో గల  అంబేద్కర్ సెంటర్ నందు మంత్రి పొంగులేటి అనుచరులు  ఆర్యవైశ్య జిల్లా కార్యదర్శి కాటేపల్లి కిరణ్ కుమార్, మాట్టూరి జనార్దన్ ఆధ్వర్యంలో  తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ రోజు మువ్వా జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కాంగ్రెస్ శ్రేణులు పొంగులేటి మువ్వా అభిమానులు భారీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేసారు.ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ  నిరంతరం ప్రజల ,  రైతుల శ్రేయస్కరం కోసం పాటుపడే గొప్ప నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటూ మన జిల్లాకు మన జిల్లా వాసులే మంత్రులుగా చైర్మన్ గా ఉన్నందుకు మనకు ఎంతో గర్వకారణం అని ఈ సందర్భంగా వారు అన్నారు.  ఖమ్మం జిల్లాలో వరద పోటు ఎత్తటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని నా పుట్టినరోజులు వేడుకలు జరపొద్దని ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారికి సహాయం చేయాలని మువ్వా అన్న  సూచించడంతో కల్లూరు నుంచి మంత్రి పొంగులేటి తరఫున పాలేరు నియోజకవర్గం వరద బాధితులకు 1,50,000 నిత్యావసర సరుకులను సుమారు 200 కుటుంబాలకు వారికి అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భాన్ని  పురస్కరించుకొని  500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్దబోయిన దుర్గ ప్రసాద్, మాజీ ఎంపీటీసీ కొండూరి కిరణ్,  షేక్ అప్రోజ్ ,బాలసాని లక్ష్మీనారాయణ ,రామిరెడ్డి గండ్రపు, అనిల్, రాజేష్, శ్రీకాంత్, ఫణి ,షిముల్లా, రవి, మత్తి గోపాల్ ,చోటే, సారధి పండు, మల్లేష్ రావు, బొజ్జయి ,రాధాకృష్ణ, ముల్లంగి రమేష్ తదితరులు పాల్గున్నారు.