దామర్ గిద్దా లో ఘనంగా దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర .

దామర్ గిద్దా లో ఘనంగా దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర .

ప్రశాంతంగా ముగిసిన దుర్గామాత నిమజ్జనోత్సవ వేడుకలు 

 ఫ్రెండ్స్ అసోషియన్ కమిటీ వారికి శాంతియుతంగా జరుపాలని శాలువాతో ఘనంగా సన్మానం చేసిన సామాజిక సేవ కార్యకర్త లక్ష్మణ్ గారు 

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ధ మండల పరిధిలోని శేరి ధామర్ గిద్ధా గ్రామంలో దుర్గాదేవి నిమజ్జనం ఫ్రెండ్స్ అసోషియన్ కమిటీ అధ్యక్షుడు యడుమలే శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.దుర్గాదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని నవరాత్రులు పూజలందుకొని నిమజ్జన శోభాయాత్ర కోలాటాలు, నృత్యాలు, బ్యాండ్ బాజా భజంత్రీలు మధ్య ఊరేగింపు నిర్వహించారు,దుర్గామాత ఫ్రెండ్స్ అసోషియన్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సూర్య ప్రకాష్ రెడ్డి, బీ.ర్.యస్ పార్టీ అధ్యక్షుడు పోలీస్ పటేల్ శ్రీధర్ రావు పటేల్, ప్రముఖ రాజకీయ నిష్ణాతుడు మనుర్ అంజిరెడ్డి,గణపతి పటేల్ గారికి శాలువాతో ఘనంగా సన్మానం అంబేద్కర్ పూలే సేవ సమితి తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ లక్ష్మణ్.. ఈ దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమంలో మండల్ కో ఆప్షన్ మెంబర్ మహ్మద్ రఫీ, డికె.శివకుమార్, తుర్పే చంద్రకాంత్ల్,బీజేపీ పార్టీ సీనియర్ నేత బస్వరాజు, మనుర్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రేమ్ కుమార్ రావు పటేల్, తులేర్ అనిల్ కుమార్, రామ్ లక్ష్మణ్ రావు పటేల్ తదితరులు పాల్గొని విజయవంతం చేసినారు.