దారుణం.. నంద్యాల జిల్లాలో మహిళ దారుణ హత్య.. అసలు ఏమైంధంటే..! వార్త చూడండి

దారుణం.. నంద్యాల జిల్లాలో మహిళ దారుణ హత్య.. అసలు ఏమైంధంటే..! వార్త చూడండి

జనం న్యూస్: ఆళ్లగడ్డ పట్టణంలో మహిళ దారుణ హత్యకు గురయిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ పట్టణంలోని పాతూరు వీధికి చెందిన అట్లా శ్రీదేవి, అట్లా భాస్కర్‌ రెడ్డిలు మంగళవారం రాత్రి ఇంట్లో ఉండగా దుండగులు ఇంటిలోకి చేరుకుని కళ్ళలో కారంపొడి చల్లి, కత్తులతో దాడి చేసి నరికారు. ఈ ఘటనలో అట్లా శ్రీదేవి (55) అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త భాస్కర్‌ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అట్లా శ్రీదేవి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి తరుపున భూమా అఖిలప్రియకు మద్దతుగా చురుకుగా ప్రచారంలో పాల్గొన్నారు. అట్లా కుటుంబంలో కొద్ది కాలంగా ఆస్తులకు సంబంధించి వివాదం నెలకొంది. అట్లా శ్రీదేవి హత్య సమాచారం తెలిసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌, టిడిపి తాలుకా యువ నాయకులు భూమా జగత్‌ విఖ్యత్‌ రెడ్డిలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి శ్రీదేవి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు కారకులైన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిఎసిపి షర్ఫుద్దీన్‌ ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరనేది తెలియాల్సి ఉంది.