నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఏసీపీ కిషోర్ కుమార్

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఏసీపీ కిషోర్ కుమార్

జనం న్యూస్ సెప్టెంబర్ 13 శాయంపేట మండలం  క్రషర్ నిర్వాహకులు నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ హెచ్చరించారు హన్మకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని పత్తి పాక ప్రగతి సింగారం తహరాపూర్ గ్రామాలలోని క్రషర్లను ఎస్ఐ ప్రమోద్ కుమార్ తో కలిసి గురువారం నాడు ఆయన తనిఖీ చేశారు ప్రగతి సింగారం లోని వెంకటేశ్వర క్రషర్ కు సంబంధించిన వివరాలను సిబ్బంది తెలపకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు తహరాపూర్ లోని అభిరామ్ బాలాజీ రోబో శాండ్ సాయి దత్త క్రషర్లలో  పేల్చే సామాగ్రిని సంబంధించిన మ్యాగ్జిక్ బాక్సులకు తాళం వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు తనిఖీలపై ముందస్తుగా సమాచారం ఇచ్చినా పట్టింపు లేకుండా క్రషర్ల నిర్వాహకులు ఇలా వ్యవహరించడం తగదన్నారు అన్ని క్రషర్లలో ర్యాలీ ఫీజు చెల్లింపు స్టాక్ లేజర్ వాహనాల వివరాలతో పాటు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు పరిమితికి మించి బ్లాస్టింగ్ చేయవద్దు అని తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సతీష్ పోలీస్ సిబ్బంది క్రషర్ యజమాన్యాలు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ప్రగతి సింగారం వద్ద చలివాగు బ్రిడ్జిపై వినాయక నిమర్జన ప్రదేశాన్ని ఏసీపీ కిషోర్ కుమార్ పరిశీలించారు.....