బగలాముఖీ శక్తిపీఠంలో మంగళవారం మహాపూజలు

బగలాముఖీ శక్తిపీఠంలో మంగళవారం మహాపూజలు

అమ్మవారి ఉపాసకులు, బ్రహ్మర్శి శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు..

రుద్రయామల బగలా అష్టోత్తర నామర్చనలతో అమ్మవారికి, హరిద్రార్చన..
పీతవర్ణ వస్త్రాలు పీతవర్ణ పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ..

అమ్మవారి భక్తులకు పులిహోర ప్రసాదం అందజేసిన కొడకంచి సుదర్శన్ గౌడ్..


 జనం న్యూస్ సెప్టెంబర్17.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ : అత్యంత శక్తిపీఠాలలో ఒకటైన శివ్వంపేట శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో అమ్మవారికి బగలాముఖీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం ఉదయం అమ్మవారి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖీ అమ్మవారికి మహాపూజలు నిర్వహించడం జరిగినది. బ్రహ్మర్శి శాస్త్రుల వెంకటేశ్వర శర్మ బగలాముఖీ అమ్మవారిని పీతవర్ణ పుష్పాలు,పీతవర్ణ వస్త్రాలతో విశేషంగా అలంకరించి, అమ్మవారికి రుద్రయామల బగలా అష్టోత్తర నామర్చనలతో హరిద్రార్చన నిర్వహించడమే కాకుండా అమ్మవారికి అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించి,నానా విధపలాలతో నైవేద్యం సమర్పించడం జరిగినది. బగలాముఖీ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు హాజరైన భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.బగలాముఖీ అమ్మవారికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అమ్మవారి భక్తులకు మంగళవారం రోజు ప్రతివారం మాదిరిగానే అమ్మవారి భక్తులకు శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  కొడకంచి సుదర్శన్ గౌడ్ పులిహోర ప్రసాదం అందజేయడం జరిగినది.అమ్మవారి పూజలలో  మాజీ ఉపసర్పంచ్ బాసంపల్లి రామగౌడ్, గౌడసంఘం మండల అధ్యక్షులు కొడకంచి రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్, వీరాస్వామి గౌడ్,పత్రాల త్రినేష్ గౌడ్, బొడ్డు నర్సిములు, కొంతాన్ పల్లి సత్యనారాయణ గౌడ్,రాజీపేట కిషన్, అమ్మవారి అర్చకులు ఆనంద్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.