పౌర్ణిమా పర్వదిన సందర్భం.. అమ్మవారికి మహమంత్ర హావనము

పౌర్ణిమా పర్వదిన సందర్భం.. అమ్మవారికి మహమంత్ర హావనము

బగలాముఖీ నామస్మరణతో మార్మోగిన శివ్వంపేట బగలాముఖీ శక్తిపీఠం పరిసరాలు..

అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మహామంత్ర హావనము..

శ్రీగురుపీఠం ట్రస్టు పౌండర్ చైర్మన్, బగలాముఖీ ట్రస్టు సభ్యులు జిన్నారం జిశివకుమార్ గౌడ్ జన్మదిన వేడుకల సందర్బంగా అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ..

అమ్మవారి భక్తులకు అన్నదానం చేసిన శ్రీగురుపీఠం పౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ - రమాదేవి దంపతులు..


 జనం న్యూస్ సెప్టెంబర్ 18.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్  

ప్రపంచంలోనే ఎక్కడ లేని విదంగా, దేశంలోనే మొట్టమొదటి సారిగా మండల కేంద్రమైన శివ్వంపేటలో బగలాముఖీ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అనతికాలంలోనే నిర్మితమై, ప్రతినిత్యం భక్తులకు దర్శనమిస్తూ, భక్తులకు కొంగు బంగారమై, కోరిన కోరికేలను తీర్చడమే కాకుండా తనను నమ్మిన భక్తుల ప్రతిభందకాలను తొలగిస్తున్న శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో పౌర్ణిమా పర్వదినం సందర్బంగా బుధవారం అమ్మవారి ఉపాసకులు బ్రహ్మర్శి, శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖీ అమ్మవారిని పీతవర్ణ వస్త్రాలు, పీతవర్ణ పుష్పాలతో విశేష అలంకరించి, బగలా అష్టోత్తర శతనామర్చనలతో హరిద్రార్చన, ప్రత్యేక పూజలు, మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహించడమే కాకుండా  బగలాముఖీ మహామంత్ర హావనము నిర్వహించడం జరిగినది.అమ్మవారి దర్శనం కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శ్రీగురుపీఠం చైర్మన్ శివకుమార్ గౌడ్- రమాదేవి ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ..పౌర్ణిమ పర్వదినం బుధవారం తన పుట్టినరోజు సందర్బంగా గూడూరు శ్రీగురుపీఠం ట్రస్టు పౌండర్ చైర్మన్, బగలాముఖీ ట్రస్టు సభ్యులు, హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ బగలాముఖీ అమ్మవారికి పట్టు వస్త్రాలను తన కుటుంబ సభ్యుల చేతులమీదుగా అందజేశారు.మహమంత్ర హావనములు పాల్గొన్న ప్రముఖులు...బుధవారం జరిగిన బగలాముఖీ మహామంత్ర హావనములో ఉమ్మడి మెదక్ జడ్పీ రిటైర్డ్ సూపరిండెంట్ కసిని దుర్గయ్య, నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డు రిటైర్డ్ ఎస్ఈ బంధ రమేష్,బగలాముఖీ ట్రస్ట్ అధికారసభ్యులు జిన్నారం పెద్దగోని సూర్యకుమార్ గౌడ్,రిటైర్డ్ ఎంఈఓ రమణరెడ్డి, గౌడ సంఘం మండల అధ్యక్షులు కొడకంచి రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్, హార్జా నాయక్, విశ్వశ్రీ లా ఛాంబర్స్ సీఎఓ లిఖిత, నల్లపల్లి శ్రీనివాస్, సాయి కుమార్. శక్తిపీఠం ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, కొత్తపేట నర్సిములు గౌడ్, పత్రాల రాజు గౌడ్, పిల్లుట్ల డాక్టర్ సండ్ర సుదర్శన్, వీరాస్వామి గౌడ్, వడ్ల బ్రహ్మచారి, కిషన్, కొంతాన్ పల్లి సత్యనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.  అమ్మవారి భక్తులకు శివకుమార్ గౌడ్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం..ప్రతి పౌర్ణమ పర్వదినం సందర్బంగా మాదిరిగానే బుధవారం జరిగిన పౌర్ణిమ పర్వదిన మహమంత్ర హావనములో పాల్గొన్న భక్తులందరికి స్వర్గీయ జిన్నారం పెద్దగోని లింగయ్య గౌడ్ - అంజమ్మ స్మారకార్థం శ్రీగురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ -రమాదేవి దంపతులు తమ స్వంత డబ్బులతో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అన్నదానం చేసిన శివకుమార్ గౌడ్ దంపతులను అమ్మవారి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ అభినందించారు.