మరణించిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

మరణించిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 04 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
మరణించిన హెూంగార్డు కుటుంబానికి 'చేయూత' గా రూ.3,25,890/-ల చెక్ ను అందజేసిన జిల్లా ఎస్పీ*
మరణించిన కానిస్టేబులు కుటుంబానికి రూ.1,00,000/-ల అడిషనల్ కార్పస్ ఫండ్ చెక్ అందజేత
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేసి, ఇటీవల కాలంలో మరణించిన కానిస్టేబులు, హెూంగార్డు కుటుంబాలకు “చేయూత”ను అందించేందుకు సిబ్బంది ప్రోగు చేసిన ఒక్క రోజు అలవెన్సును వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు సెప్టెంబరు 3న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎన్ మాట్లాడుతూ - పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవసాత్తు లేదా ఆకస్మికంగా లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు కుటుంబాలు అర్ధంతరంగా తమ కుటుంబ యజమానిని కోల్పోయి, ఆర్థికంగా నష్టపోయిన సమయంలో వారికి ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ అందేంత వరకు వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొనేందుకు పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వచ్చి, కొంత మొత్తాన్ని ప్రోగు చేసి, వారి కుటుంబాలకు "చేయూత”గా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ అన్నారు. జిల్లా పోలీసుశాఖలో హెూంగార్డుగా పని చేస్తూ, మరణించిన ఎస్. చిన్నోడు కుటుంబానికి 'చేయూత’గా హెూంగార్డులు ప్రోగు చేసిన ఒక్కరోజు అలవెన్సు రూ.3,25,890/- చెక్ ను వారి సతీమణి ఎం.రజనికి జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు. అదే విధంగా జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబులుగా పని చేస్తూ, అనారోగ్య కారణాలతో మరణించిన పి.గౌరీ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన అడిషనల్ కార్పస్ ఫండ్ రూ. 1,00,000/- ల చెక్  ను వారి సతీమణి టి.ఇందిరా వసంతికి జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు అందజేసారు. మరణించిన హెూంగార్డు చిన్నోడు సతీమణి రజనికి ఇప్పటికే హెూంగార్డుగా ఉద్యోగం కల్పించామన్నారు. అదే విధంగా కానిస్టేబులు గౌరీ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం నుండి రావల్సిన రాయితీలను సకాలంలో వచ్చే విధంగా చర్యలు చేపట్టడంతోపాటు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు ప్రతిపాదనలు పంపుతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ఆఫీసు సూపరింటెండెంట్ శ్రీ ఎ.ఎస్.వి. ప్రభాకరరావు, ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్ మరియు పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.