మహాత్మాగాంధీ కి నివాళులర్పించిన ఎమ్మెల్యే జీఎస్సార్

మహాత్మాగాంధీ కి నివాళులర్పించిన ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ అక్టోబర్ 2 శాయంపేట మండలం కేంద్రంలో జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాపూజీ జీవితం సత్యం, సామరస్యం, సమానత్వం అనే సిద్ధాంతాలతో గడిచిందన్నారు. గాంధీ ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుదిపాల బుచ్చిరెడ్డి పరకాల వ్యవసాయ కమిటీ చైర్మన్ మాలపల్లి రవీందర్ ఎస్మాజీ ఎంపీపీ బసాని చంద్రప్రకాష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిందం రవి కటయ్య బసాని మార్కండేయ దుబసి కృష్ణమూర్తి చల్ల చక్రపాణి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...