*మహాత్మా గాంధీ కి ఘనంగా నివాళులు అర్పించిన* ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

*మహాత్మా గాంధీ కి ఘనంగా నివాళులు అర్పించిన*   ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

జనం న్యూస్,పార్వతీపురం, అక్టోబర్ 2, రిపోర్టర్ ప్రభాకర్: పార్వతీపురం పట్టణం గాంధీ సత్రం వద్ద ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర.అనంతరం ఎమ్మెల్యే 

మహాత్ముని చిత్రపటానికి పూల మాల వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో శాంతియుత స్ధాపనకు మహాత్ముడు చూపిన అహింసా మార్గం, సెక్యులరిజం అన్నవి ప్రతీ ఒక్కరూ ఆచరించాల్సిన మార్గాలన్నారు.అనంతరం గాంధీ జయంతి సందర్భంగా పేద ప్రజలుకు అన్నదానం, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.