యువతి అదృశ్యం పెద్ద కూతురు భర్త పై అనుమానం*

యువతి అదృశ్యం పెద్ద కూతురు భర్త పై అనుమానం*

జనం న్యూస్ : (క్రైం) 11 జూలై 2024, నిడమనూరు మండలం,  నల్లగొండ జిల్లా, బొంగరాల శ్రీనివాస్ ప్రతినిధి 
నిడమనూరు మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన షేక్ మహమూద్ కి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు అష్రఫ్ ని నాలుగు సంవత్సరాలు క్రితం హైదరాబాద్ కు చెందిన సయ్యద్ షాజి పుల్ల హుస్సేన్ కు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. వారికి ఒక కొడుకు కలడు .హైదరాబాదులో ఉంటున్న బిడ్డ అల్లుడు మూడు రోజుల క్రితం ధర్మాపురానికి వచ్చినారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం 3:30 గంటల సమయంలో చిన్న కూతురు షేక్ అఫ్రీన్ వయసు 25 సం లు. ఆఫ్రిన్ ఎటో వెళ్లిపోయిందని గ్రహించి చుట్టుపక్కల మరియు తెలిసిన వారి ఇంటి దగ్గర అడిగిన కానీ ఆచూకీ లభించలేదు. ఆమెతోపాటు పెద్ద బిడ్డ భర్త మరియు అల్లుడు అయిన సయ్యద్ షాజి కూడా కనిపించడం లేదు. అతనిపై అనుమానం ఉన్నదని ఆఫ్రీన్ తండ్రి మహమూద్ ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్ రావు తెలిపారు.