శివంపేట మండలంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..

శివంపేట మండలంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..

మండల వ్యాప్తంగా ఎగిరిన మువ్వెన్నెల జాతీయ జెండా..

 జనం న్యూస్ సెప్టెంబర్17.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్  సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవ వేడుకలు మంగళవారం అధికారులు ఘనంగా నిర్వహించడం జరిగినది. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల వ్యాప్తంగా మువ్వెన్నెల జాతీయ జెండా రెపరెపలాడింది. ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా మండల తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ కమలాద్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపీడీఓ నాగేశ్వర్ జాతీయ జెండాను ఎగురవేశారు. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు పంచాయతీ కార్యదర్శి రమాదేవి, పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ దాసరి మహిపాల్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి ముందు డాక్టర్ సాయిసౌమ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. పీఎసీఎస్ బ్యాంకు ముందు చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి మూడు రంగుల మువ్వెన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో ఉపతహసీల్దార్ షఫీయొద్దిన్, గిర్థవర్ కిషన్, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ నరేందర్ రెడ్డి, రెవిన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.