శివ్వంపేటలో వివాహిత నాగమణి అదృశ్యం

శివ్వంపేటలో వివాహిత నాగమణి అదృశ్యం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

 జనం న్యూస్ సెప్టెంబర్21.24 శివంపేట  మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

మండల కేంద్రమైన శివ్వంపేటకు చెందిన లస్కర్ నాగమణి (50) ఈనెల 18న బుధవారం ఉదయం ఇంటి నుండి వెళ్ళిపోయినందని  కుటుంబీకులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం శివ్వంపేటకు చెందిన లస్కర్ నాగమణి భర్త నర్సిములు 18న ఉదయం 5 గంటల సమయంలో పొలం చూడడానికని వెళ్లి తిరిగి 8 గంటలకు ఇంటికి వచ్చే సరికి తన భార్య నాగమణి ఇంట్లో కనబడలేదన్నారు. చుట్టుపక్కల, బంధువులు, తెలిసిన వారి వద్ద ఆమె కోసం వెతికిన ఆచూకీ లభించలేదన్నారు. నాగమణి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇంటినుండి వెళ్ళిపోయిందని భర్త నర్సిములు శనివారం పిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నాగమణి ఆచూకీ తెలిసిన వెంటనే సెల్ 9000261434, 8008262613, ఎస్ఐ : 8712657930 నెంబర్లకు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.