గణేశుని లడ్డు కైవసం చేసుకున్న వి6 విలేకర్ నటరాజ్ గౌడ్

గణేశుని లడ్డు కైవసం చేసుకున్న వి6 విలేకర్ నటరాజ్ గౌడ్

అత్యధిక పాట 50 వేల రూపాయలతో లంభోదరుని లడ్డు పొందిన 
నటరాజ్ గౌడ్ ను ఘనంగా సన్మానించిన నిర్వాహకులు

 జనం న్యూస్ సెప్టెంబర్21.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ కాలనీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతిష్టించిన గణపతి లడ్డును శుక్రవారం సాయంత్రం వేలం వేయగా, వేలంపాటలో 50 వేల రూపాయలు అత్యధికపాట పాడి పెద్దగోని నటరాజ్ గౌడ్ వినాయకుని లడ్డూను, కైవసం చేసుకున్నారు. లడ్డు అందుకున్న నటరాజ్ గౌడ్ ను వినాయకుడిని ప్రతిష్టించిన నిర్వాహకులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈసందర్బంగా వి6 విలేకర్  నటరాజ్ గౌడ్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా గణనాథుని లడ్డూను కైవసం చేసుకున్నమన్నామని, ఈఏడాది కూడ విగ్నేశ్వరుని అనుగ్రహం కలగడం సంతోషంగా ఉందన్నారు నటరాజ్ గౌడ్ అన్నారు  ఈకార్యక్రమంలో పెద్దగౌని శ్రీరాం గౌడ్, ఇసారపు సాయి శివగౌడ్ ,బాసంపల్లి సుశాంత్, బాసంపల్లి రాకేష్ గౌడ్, ఇసారపు పవన్ సాయి గౌడ్, మణిదీప్, జయంత్ గౌడ్, మందిర్ గౌడ్, బిట్టు గౌడ్, సుప్రీత్ గౌడ్ ,విషిత్ గౌడ్, యశ్వంత్ గౌడ్, సాయి శివ గౌడ్, శివ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.