*ఆర్థిక బాధలు తాళలేక ఆత్మహత్య...అనుమానాస్పద కేసుగా నమోదు- ఎస్సై ఇ.రవికుమార్*

*ఆర్థిక బాధలు తాళలేక ఆత్మహత్య...అనుమానాస్పద కేసుగా నమోదు- ఎస్సై ఇ.రవికుమార్*

జనం న్యూస్ మిర్యాలగూడ దామరచర్ల జులై 31

   నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో తేదీ- 30న,మధ్యాహ్నన సమయంలో తన నివాసం వద్ద కంచరకుంట్ల రమణ రెడ్డి s/o సుధాకర్ రెడ్డి, వయసు.39 సమవత్సరాల గల అతడు కుటుంబ ఆర్దిక విషయంలో తన భార్యతో గొడవపడి తన బెడ్రూంలో గల సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని చనిపోయాడు. ఇట్టి విషయంలో మృతుని పెద్దమ్మ కుమారుడైన చిట్యాల మధుసూధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు వాడపల్లి ఎస్‌ఐ ఇ.రవి కుమార్ అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదుచేసి పూర్తి వివరాల సేకరణ కొరకు దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.