కంగ్టి మండల కేంద్రంలో ఫ్రైడే - డ్రైడే

కంగ్టి మండల కేంద్రంలో  ఫ్రైడే - డ్రైడే

పారిశుద్ధ్య పనులను  పరిశీలించిన మండల  అధికారులు

జనం న్యూస్,సెప్టెంబర్ 06,కంగ్టి 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని పలు గ్రామాలలో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే, నిర్వహించారు.ఈ సందర్భంగా కంగ్టి 
మండల కేంద్రంలోని  పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ టీచర్స్,ఆశా వర్కర్స్,తో కలిసి వ్యాధులపై అవగాహన కల్పించారు.  అనంతరం ఎంపీడీవో తడ్కల్,గ్రామంలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం షెడ్యూల్డ్ క్యాస్ట్ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో  మండల ప్రత్యేక అధికారి నూతన్ కుమార్, డిఎల్పిఓ సంజీవరావు, ఎంపీడీవో ఎం సత్తయ్య 
ఎంపీఓ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.