ఇవేమి పిచ్చి ఆటలు రా నాయనా..! నిప్పుల్లోకి తోసి పైశాచిక ఆనందం పొంది (వీడియో చూడండి)

జనం న్యూస్: సోమవారం దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా హోలీక దహనం చేయగా.. స్నేహితుడ్ని నిప్పుల్లో తోసేశారు పైశాచిక ఆనందాన్ని పొందారు మిగిలిన ఫ్రెండ్స్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. .నోయిడాలోని ఓ ప్రాతంలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ స్థానికులు హోలిక దహనం చేశారు. మంటలు చల్లారిపోయి.. నిప్పులు ఉన్నాయి. అంతలో అక్కడకు కొంత మంది స్నేహితుల వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అంతలో ఆ స్నేహితుల గుంపు .. తమ ఫ్రెండ్ ఒకరిని ఎత్తి నిప్పుల్లో తోసేశారు. దీంతో భయపడ్డ అతడు వెంటనే.. నిప్పుల గుండం నుండి బయట పడ్డాడు. ఈ ఘటనలో అతడి పాదాలకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం కాలిన గాయాలతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, ఈ ఘటనపై యుపి పోలీసులు మౌనంగా ఉండటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. 'బిస్రఖ్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు చేయగా, స్నేహితులు సరదాగా అతడ్ని తోశారని, ఇది ఎవ్వరూ చేయలేదని, ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు అందలేదు' అంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. దీనిపై సీరియస్ అయిన సోషల్ మీడియా సైనికులు.. ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ.. ఇది అబద్దం అని నిరూపించగలరా అంటూ మండిపడుతున్నారు. నలుగురైదుగురు ఓ వ్యక్తిని మంటలో తోసేసే కేసు ఎందుకు నమోదు చేయడం లేదని సుమోటోగా కేసు స్వీకరించాలంటూ కోరుతున్నారు. స్నేహం ముసుగులో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పేర్కొంటున్నారు.