'మార్కులు వేయకపోతే..మా తాతతో చేతబడి చేయిస్తా' మాష్టారుకు విద్యార్థి బెదిరింపు.

'మార్కులు వేయకపోతే..మా తాతతో చేతబడి చేయిస్తా' మాష్టారుకు విద్యార్థి బెదిరింపు.

జనం న్యూస్: బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ కంగుతిన్నారు. తెలుగు సబ్జెక్టులో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి వింత సమాధానం రాశారు. 'నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా' అని ఉండటం చూసి.. టీచర్ అవాక్కయ్యారు. వెంటనే ఆన్సర్ షీట్ను ఉన్నతాధికారులకు చూపించారు. అయితే, ఆ విద్యార్థికి 70 మార్కులు రావడం విశేషం.