కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం......

కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం......

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్..

స్థానిక ఎన్నికలలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని కొడకంచి శ్రీనివాస్ గౌడ్  ధీమా..


 జనం న్యూస్ అక్టోబర్6.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్


ప్రజల ఆశీస్సులతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీని శివ్వంపేట మండలంలో మరింత బలోపేతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శివ్వంపేట మాజీ ఎంపీటీసీ జంగం విజయవెంకటేష్, ఉశగోని శంకర్ గౌడ్ తో కలిసి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈసందర్బంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం జీరో కరెంట్ బిల్లు, 5 వందలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ ఇలా ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో మరింత ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు. త్వరలోనే సీనియర్ నాయకులమంతా కలిసి మండలంలో ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీలో నాయకులను సమన్వయం చేసి, రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శివ్వంపేట మండలం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారబోతోందని ఆయన జ్యోస్యం పలికారు. ఈకార్యక్రమంలో ముద్దగల్ల నర్సిములు, తదితరులు పాల్గొన్నారు.