కొంతాన్ పల్లిలో నీటి సమస్య పరిష్కారానికి చైర్మన్ వెంకట్రాంరెడ్డి సహకారం......

కొంతాన్ పల్లిలో   నీటి సమస్య పరిష్కారానికి చైర్మన్ వెంకట్రాంరెడ్డి సహకారం......

తన స్వంత డబ్బులు 35 వేల రూపాయలతో సింగిల్ పేజ్ మోటారు ఏర్పాటు..

ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కొంతాన్ పల్లి గ్రామస్తులు..

 జనం న్యూస్ సెప్టెంబర్20.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

మంచినీటి సమస్య పరిష్కారానికి తనవంతు సహకారం తప్పకుండ అందిస్తానని పీఎసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి అన్నారు. మండలంలోని కొంతాన్ పల్లి గ్రామంలోని రెండో వార్డులో కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ వెంకట్రాంరెడ్డి శుక్రవారం 35 వేల రూపాయలు వెచ్చించి నూతన సింగిల్ పేజ్ మోటారును ఏర్పాటు చేయించి నీటి సమస్యను పరిష్కరించారు. ఈసందర్బంగా వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ కొంతన్ పల్లిలో ఎలాంటి నీటి సమస్యలు వున్నాగాని తన ద్రుష్టికి తీసుకొస్తే తన స్వంత డబ్బులతో తప్పకుండ పరిష్కరిస్తానన్నారు. అడిగిన వెంటనే కాదనకుండా తన స్వంత డబ్బులు 35 వేల రూపాయలతో సింగిల్ పేజ్ మోటారును ఏర్పాటు చేయించిన చైర్మన్ వెంకట్రాంరెడ్డికి కొంతాన్ పల్లి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో గ్రామ నాయకులు ఆకుల నర్సిములు, వడ్ల లక్ష్మణ్ చారి, చింతల దుర్గారెడ్డి, చింతల ప్రభాకర్ రెడ్డి, గొల్ల యాదగిరి, పోచయ్య, రాము, లక్ష్మణ్, కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.