గంజాయి రవాణ నియంత్రణకు నిరంతర తనిఖీల చేపట్టాలి

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 12 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
గంజాయి నియంత్రణ లక్ష్యంగా బొడ్డవర పోలీసు చెక్ పోస్టును బలోపేతం చేసామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గంజాయి రవాణ కు ఆకస్మికంగా వేరు వేరు ప్రాంతాల్లో డైనమిక్ వాహన తనిఖీలు చేపడుతున్న పోలీసు బృందాలు గంజాయి కేసుల్లో అరెస్టు అయిన నిందితులపై హిస్టరీ షీట్లు తెరవాలని ఆదేశాలిచ్చిన జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు సెప్టెంబరు 11న ఎస్.కోట పోలీసు స్టేషనుని ఆకస్మికంగా సందర్శించి, స్టేషను ప్రాంగణాన్ని, పోలీసు బిల్డింగ్ లోని గదులను, ప్రాపర్టీ రూం, లాకప్ గదులను పరిశీలించారు. పోలీసు స్టేషను ప్రాంగణంలో సీజ్ చేసి ఉన్న వాహనాలను పరిశీలించి, ఏ వాహనం ఏ కేసులోనిది తెలిసే విధంగా లేబుల్స్ ను ఏర్పాటు చేసి, రికార్డుల్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్.కోట పోలీసు స్టేషనులోని వివిధ రికార్డులు, సిడి ఫైల్స్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తనిఖీ చేసారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి బొడ్డవర మీదుగా ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణ జరుగుతున్నందున, అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా బొడ్డవర చెక్ పోస్టును బలోపేతం చేసామని, నిరంతరం వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టామన్నారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితులపై హిస్టరీ షీట్లు తెరవాలని, వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తులో ఉన్న గంజాయి కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, పరారీలో ఉన్న ప్రధాన నిందితులను అరెస్టు చేయాలని, సంబంధిత కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలన్నారు. గంజాయి నియంత్రణకు ఆకస్మికంగా వేరు వేరు ప్రాంతాల్లో డైనమిక్ వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. గంజాయి కేసుల్లో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి, ప్రధాన నిందితుల సమాచారాన్ని రాబట్టాలన్నారు. అనంతరం, స్టేషనులో క్రైమ్ చార్ట్ పరిశీలించి, పోలీసు స్టేషను పరిధిలో రహదారి ప్రమాదాలు ఎక్కడ ఎక్కువ జరుగు తున్నది, బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నది సిఐని అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎస్.కోట పోలీసులు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ స్పాట్స్ కు ఇరువైపు కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు తరుచూ జరుగుటకు గల కారణాలను గుర్తించి, స్పీడు బ్రాకర్లు, స్టాపర్లును ఏర్పాటు చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, ప్రజలకు రహదారి భద్రత, మహిళల భద్రత పట్ల, కొత్త చట్టాలు పట్ల అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించే విధంగా చూడాలని, హెల్మెట్ ప్రాముఖ్యతను ద్విచక్ర వాహనదారులకు వివరించి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దొంగతనాల నియంత్రణకు పగలు, రాత్రి బీటులను వేయాలని, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు సిబ్బంది తరుచూ తమకు కేటాయించిన దత్తత గ్రామాలను సందర్శించి, గ్రామం లో శాంతిభద్రతల పరిస్థితులను తెలుసుకొని, సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అనుమానస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సైబరు మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, సైబరు మోసాలపై నమోదైన కేసుల్లో నిందితుల బ్యాంకు అకౌంట్స్ లో ఫ్రీజ్ అయిన నగదును తిరిగి బాధితులకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ గారు స్టేషను సందర్శించిన సమయంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ కే.కే.వి.విజయనాథ్, ఎస్.కోట సిఐ వి.ఎన్.మూర్తి, ఎన్.కోట రూరల్ సిఐ కె.రవికుమార్, ఎస్ఐ గంగరాజుమరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది హాజరుగా ఉన్నారు.