.కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ధ్వజనిత్తిన కాంగ్రెస్ నాయకులు

.కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ధ్వజనిత్తిన కాంగ్రెస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రతినిధి దినేష్

ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కణమేని చక్రధర్ రెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారిపై అనుచిత వాక్యాలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదులపై రాళ్లు విసిరిన తెలంగాణ ద్రోహి, భార్యను,బిడ్డలు అడ్డం పెట్టుకొని, ప్రజలను తప్పుతోవ పట్టించి గెలిచిన నీకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు. కెసిఆర్, కేటీఆర్ మన్ననలను పొందడానికి నువ్వు వేస్తున్న చిల్లర వేశాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.నీ గత చరిత్ర చూసే గవర్నర్ కోటాలో రావలసిన ఎమ్మెల్సీ పదవిని గవర్నర్ గారు తిరస్కరించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టిఆర్ఎస్ పార్టీ నాయకుల.చిల్లర వేశాలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య,కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు,మాజీ ఎంపిటిసి, శ్రీనివాస్,కొండం రాజిరెడ్డి,పట్టణ ,దునుకుల కొండయ్య ,కనమేని శ్రీనివాస్ రెడ్డి,కలకొండ కిషన్ రావు,అంజన్ రావు,ఏనుగు  వేణు,తోట ధర్మేందర్,బద్దిపడిగ ప్రతాపరెడ్డి,దేవేందర్,సద్ది మధు,కొండల్ రెడ్డి,కొప్పు రమేష్,మిరుదొడ్డి దేవేందర్, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..