గల్ఫ్ కార్మికులకు సహాయం చేయండి..

గల్ఫ్ కార్మికులకు సహాయం చేయండి..

జనం న్యూస్ సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రతినిధి దినేష్ 

గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణవాసుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేయడంతో పాటువారికి అన్ని విధాల సహాయపడాలని గల్ఫ్ లేబర్ యూనియన్ నాయకులు తెలంగాణ ప్రభుత్వ విప్పు అది శ్రీనివాస్ ని కోరారు.గల్ఫ్ బోర్డు. గల్ఫ్ సంక్షేమ నిది గల్ఫ్ కరిమికులకు ఏర్పాటు చెయ్యాలి, గల్ఫ్ లో చనిపోయిన వారికీ ఐదు లక్షల ఎక్సగ్రేసీయా ఇవ్వాలి,గల్ఫ్ కార్మికుల పిల్లాలకు గురుకుల పాఠశాల లో కళాశాలలో  ప్రధాన్యత ఇవ్వాలి,అలాగే గల్ఫ్ రిటర్న్ కు పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలి తెలంగాణ విప్ కి వినిపించారు. ఈ కార్యక్రమంలో  మిగ్రాంట్ లేబర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ భార్గవ్ నారాయణ స్వామి,జయ నారాయణ స్వామి,కార్యదర్శి ఇల్యాస్,ఫజల్ ,తిరుమల్,సామాజిక కార్యకర్త జనగమ శ్రీనివాస్, మిగ్రాంట్ లేబర్ యూనియన్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.