తెలంగాణ విముక్తి దినం..

తెలంగాణ విముక్తి దినం..

జనం న్యూస్ సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ ప్రతినిధి దినేష్ : తెలంగాణ విమోచన దినోత్సవంగా పేర్కొంటూ ముస్తాబాద్ పట్టణంలో వివేకానంద కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు అంజా గౌడ్ జాతీయ పతాకం ఎగరవేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో  .. తెలంగాణ ప్రజలందరికి విమోచన దినోత్సవ శుభకాంక్షలు తెలుపుతూ హైదరాబాద్‌కు ఇవాళ విముక్తి లభించిన రోజు అన్నారు. రజకార్లపై పోరాడిన యోధులకు నివాళుర్పిస్తున్నానని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదన్నారు. పటేల్, మున్సీ వల్లే నిజాం పాలన అంతమైందని అంజా గౌడ్వె ల్లడించారు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మళ్లారపు సంతోష్ రెడ్డి,జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, ఏళ్ల గిరిధర్ రెడ్డి, పప్పుల శ్రీకాంత్, శ్రీనివాసరావు, ఓరగంటి సత్యం, కాల్వ బాలాజీ,తాజగౌడ్,పాల్గొన్నారు.