చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

జనం న్యూస్, అక్టోబర్ 26 విజయనగరం

మక్కువ మండలంలో అనసభద్ర వద్ద జరిగిన రోడ్డు

ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్.ఐ

పైడిరాజు తెలిపారు. జియ్యమ్మవలస మండలం

డంగభద్రకు చెందిన ఈదుల నారాయణరావు విద్యుత్

పనులు నిమిత్తం ఈనెల 22 తేదీన ఒడిశా రాష్ట్రంలోని

సుంకి గ్రామానికి బైక్పై వెళ్లాడు. ఈ క్రమంలో

అనసభద్ర వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో

తీవ్రంగా గాయపడ్డ అతను.. చికిత్స పొందుతూ మృతి

చెందినట్లు ఎస్.ఐ తెలిపారు.