చీ... వీడు అసలు మనిషే కాదు...! భార్యతో కలిసి కన్నతల్లిని ..?

చీ... వీడు అసలు మనిషే కాదు...! భార్యతో కలిసి కన్నతల్లిని ..?

జనం న్యూస్: వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి కన్న తల్లిని అతి దారుణంగా హత్య చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడ బాకుల గ్రామం. ఇక్కడే రాములు-శివమ్మ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు సంతోషంగానే జీవించారు. కానీ, రాను రాను కోడలు శివమ్మ భర్త తల్లి అయిన శంకరమ్మతో తరుచు గొడవలు పడేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇటీవల అత్తాకోడళ్లు గొడవ పడి దాడి చేసుకున్నారు. ఈ దాడిలో శంకరమ్మ కాలు విరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా ప్రతీసారి గొడవ పడడంతో చుట్టుపక్కల వాళ్లు అనేక సార్లు చెప్పి చూసేవారని అంటున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం రోజు రాములు తల్లి శంకరమ్మ వారి ఇంటి ముందు ఉన్న నీటి సంపులో చనిపోయి కనిపించింది. ఈ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇక గ్రామస్తులు కోపంతో ఊగిపోయి రాములు ఇంటిపై దాడి చేయడమే కాకుండా భార్యాభర్తలను చితకబాదారు. అనంతరం స్థానికులు ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శంకరమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని రాములు, శివమ్మ దంపతులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.