చేయూత..

చేయూత..

జనం న్యూస్ సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రతినిధి దినేష్ 

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గత 9 రోజుల క్రితం గాడిచేర్ల రాజయ్య గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది.వారి యొక్క ఇంటి పరిస్థితి,ఆర్థిక పరిస్థితి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు తెలుసుకొని వారి యొక్క ఆర్థిక పరిస్థితిని  గూడెం  వాస్తవ్యులు చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు మరియు, విద్యసాగర్ రావుకి విన్నపించగా వారు మృతుని కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది.వారితో పాటు కొమ్మేట శ్రీనివాస్ గారు 25 కేజీ ల బియ్యం,మ్యాడమిన బాల్ రాజు 25 కేజీ ల బియ్యం అందిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ గాడిచేర్ల రామచంద్రం ,స్కూల్ చైర్మన్ చిలివేరి స్వామి, కొమ్మెట శ్రీనివాస్, బొమ్మ దేవరాజు, పడిగే శ్రీనివాస్ పడిగే శంకర్, చిలివేరి అజయ్, ఉమేశ్, పరిపెళ్లి నితీశ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆ కుటుంబ సభ్యులు మాధవి వెంకటేశ్వరరావు దంపతులకు ధన్యవాదాలు తెలిపారు