విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం

విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం

 జనం న్యూస్ 27-9-24 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి జోగిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ జాన్ పాల్ సహకారంతో జోగిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు దంతాల శుభ్రంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం విద్యార్థులకు టూత్ బ్రష్ లను ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు అల్లె శ్రీకాంత్, రాంబాబు, డాక్టర్ అనంత రెడ్డి, పాఠశాలల ఉపాధ్యాయులుHM రజిత లీల సిబ్బంది పాల్గొన్నారు.