దారుణం.. పిల్లల తలలు నరికిన కన్న తల్లి..! (దయచేసి పిల్లలు ఆడవారు చూడకండి)

దారుణం.. పిల్లల తలలు నరికిన కన్న తల్లి..! (దయచేసి పిల్లలు ఆడవారు చూడకండి)

జనం న్యూస్: క‌న్న‌త‌ల్లే.. బిడ్డ‌ల‌ త‌ల న‌రికి హ‌త‌మార్చింది. ఓ బిడ్డ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గాజీపూర్ జిల్లా మ‌ర్దా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకునేస‌రికి ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల‌, మొండెం వేరుగా ప‌డి ఉన్నాయి. మృతిచెందిన ఇద్ద‌రూ మ‌గ‌పిల్ల‌లు కాగా, ఆడ‌పిల్ల‌లు ఈ ఘ‌ట‌న‌ను ప్రాణాల‌తో త‌ప్పించుకుంది. వీరి తండ్రి ఆర్మీలో జ‌వాన్‌గా ప‌నిచేస్తున్నాడు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. హ‌మీర్‌పూర్ బిజౌరా గ్రామానికి చెందిన అజిత్ యాద‌వ్‌, నీతూ యాద‌వ్ దంప‌తుల‌కు ముగ్గురు పిల్ల‌లు. కుమార్తె పారీకి 9 సంవ‌త్స‌రాలు కాగా.. కుమారులిద్ద‌రూ హ్యాపీ (6), హార్దిక్ (10 నెల‌లు) చిన్న‌వాళ్లు. అజిత్ యాద‌వ్ జ‌మ్మూలో విధులు నిర్వ‌హిస్తున్నాడు. శుక్ర‌వారం రాత్రి నిద్ర‌పోయేందుకు పిల్ల‌ల‌తో క‌లిసి త‌న గ‌దిలోకి వెళ్లిన నీతూ.. క‌త్తితో పిల్ల‌ల‌పై దాడికి దిగింది. చిన్న పిల్ల‌లిద్ద‌రినీ క‌త్తితో త‌ల‌లు న‌రికి హ‌త‌మార్చింది. ఈ ఘ‌ట‌న నుంచి కుమార్తె పారీ ప్రాణాల‌తో బయ‌ట‌ప‌డింది. స‌మాచారం అందుకున్న గాజీపూర్ ఎస్పీ ఓం వీర్ సింగ్ ఘ‌ట‌నాస్థ‌లాన్ని సంద‌ర్శించారు. నీతూ యాద‌వ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఎదుట ఆమె త‌న నేరాన్ని అంగీక‌రించింది. ఆమె మాన‌సిక స్థితి స‌రిగా లేద‌ని నాలుగైదేళ్లుగా చికిత్స తీసుకుంటోంద‌ని ఎస్పీ చెప్పారు. ఈ ఘ‌ట‌న స‌మాచారం అందుకున్న అజిత్ యాద‌వ్ జ‌మ్మూ నుంచి హుటాహుటిన బ‌య‌లుదేరి గాజీపూర్‌కు వ‌చ్చాడు. కుమారుల మృత‌దేహాల‌ను చూసి క‌న్నీరుమున్నీర‌వుతున్నాడు.