నటుడు శరత్ బాబూ కన్నుమూత

నటుడు శరత్  బాబూ కన్నుమూత

జనం న్యూస్ మే 22 కాట్రేని కొన  టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు (71) కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈ మధ్యాహ్నం గం.1:32ని.లకు తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 250కి పైగా చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో నటించారు.ఆయన తెలుగు లో చివర చిత్రం జనసేన అదినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సబ్ , నరేష్ నటించిన మళ్లీ పెళ్ళిశరత్ బాబు ఆయనకి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాము వారి సంతాపం వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ యూనియన్ APMAA డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మోకా వెంకట సుబ్బారావు , ఈశ్వర గౌడ్ శ్రీరామ్ రాజేష్ తదితరులు నివాళి అర్పించారు