పచ్చదనం పరిశుభ్రత రెండవ విడత కార్యక్రమం

పచ్చదనం పరిశుభ్రత రెండవ విడత కార్యక్రమం

జనం న్యూస్, పార్వతీపురం మండలం, తేదీ సెప్టెంబర్ 14, (రిపోర్టర్ ప్రభాకర్):
పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర ఆదేశాల మేరకు, పచ్చదనం పరిశుభ్రత రెండవ విడత కార్యక్రమంలో భాగంగా పెదబొండపల్లి గ్రామం లో శనివారం ఉదయం తామర చెరువు ప్రధాన రోడ్డు గట్టు పైన టీడీపీ యువకులు ఎంతో ఉత్సాహంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేసారు.అలాగే రోడ్డు పక్కన ఉన్న పిచ్చి మొక్కలు ఉన్న డొంకలను తుప్పలను ముందుగా వెళ్లి హనుమాను  కాలని ప్రజలు పరిశుభ్రం చేశారు. వంగపండు శ్రీను, యండ్రాపు ప్రవీణ్, చోడరపు చిరంజీవి, చుక్క సంతోష్,చుక్క ప్రభాకర్, కె. ప్రశాంత్, రత్న, యై దుర్గ ,పండు మొదలగువారు పాల్గొన్నారు.