పట్టపగలు నడిరోడ్డుపై ఎం పని రా ఇది... !

పట్టపగలు నడిరోడ్డుపై ఎం పని రా ఇది... !

జనం న్యూస్: భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం, మనస్పర్థలు రావడం సహజం. వాటిని చర్చించుకుని ముందుకు సాగాల్సింది పోయి గోరుతో పోయే దాన్ని చివరికి గొడ్డలి దాక తెచ్చుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భర్త.. నడి రోడ్డుపై భార్యను కత్తితో పొడిచాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పట్టపగలు భార్యను భర్త ఎందుకు పొడిచాడు? అసలు దీని వెనకాల ఏం జరిగిందంటే? అది రాజస్థాన్ దౌసా జిల్లా బైజుపాడ పరిధిలోని కొతిన్ గ్రామం. ఇక్కడే వినీతా దేవి (22) అనే వివాహిత నివాసం ఉంటుంది. ఈమెకు గతంలో ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల ఈ దంపతులు ఇద్దరూ వినీతా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు పయనమయ్యారు. దీంతో భార్యాభర్తలు బైక్ పై బయలుదేరారు. ఇక మార్గమధ్యలోకి రాగానే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, భర్త ఒక్కసారిగా రాక్షసుడిగా మారాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పట్టపగలు భార్యపై దాడి చేసి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. భర్త దాడిలో భార్య వీనితా దేవి రక్తపు మడుగులో పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు ఆ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. ఆ మహిళపై ఏకంగా 15పైగా కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం వినీతా దేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పట్టపగలు నడిరోడ్డుపై భర్త భార్యను కత్తితో పొడిచిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.