బగలాముఖీ అమ్మవారికి నేడు పట్టువస్త్రాల సమర్పణ.

బగలాముఖీ అమ్మవారికి నేడు పట్టువస్త్రాల సమర్పణ.

గూడూరు శ్రీగురుపీఠం పౌండర్ చైర్మన్, బగలాముఖీ ట్రస్టు సభ్యులు, హైకోర్టు న్యాయవాది   జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ - రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి సమర్పించనున్న పట్టువస్త్రాలు..

శివకుమార్ గౌడ్ జన్మదినం సందర్బంగా నేడు గూడూరు, తిమ్మాపూర్, చెంది గ్రామాలలో అన్నదాన కార్యక్రమ నిర్వహణ..

 జనం న్యూస్ సెప్టెంబర్17.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్

పౌర్ణిమ పర్వదినం సందర్బంగా  బుధవారం అత్యంత శక్తిపీఠాలలో ఒకటైన మెదక్ జిల్లా శివ్వంపేట శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో బగలాముఖీ అమ్మవారికి గూడూరు శ్రీగురుపీఠం ట్రస్టు పౌండర్ చైర్మన్, బగలాముఖీ ట్రస్టు సభ్యులు, హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ - రమాదేవి పుణ్యదంపతుల ఆధ్వర్యంలో నేడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. హైకోర్టు న్యాయవాది శివకుమార్ గౌడ్ జన్మదినం సందర్బంగా నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు విశ్వశ్రీ లా ఛాంబర్స్ సిబ్బంది అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి పౌర్ణిమ పర్వదినం మాదిరిగానే తన తల్లిదండ్రులైన స్వర్గీయ జిన్నారం పెద్దగోని లింగయ్య గౌడ్ - అంజమ్మ స్మారకార్థం తన స్వంత డబ్బులతో అమ్మవారి దర్శనకోసం విచ్చేసే భక్తులందరి అన్నదానం కార్యక్రమం కూడ నిర్వహించడం జరుగుతుందని జిన్నారం జి శివకుమార్ గౌడ్  తెలిపారు. @@@ పలు గ్రామాలలో నేడు శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం @@@ తన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ సంఘ సేవకులు హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నేడు గూడూరు, తిమ్మాపూర్, చెంది గ్రామాలలో గ్రామస్తులందరికి కూడ అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.