రైతులందరికీ 2 లక్షల "రుణమాఫీ" చేయాలి.

రైతులందరికీ 2 లక్షల "రుణమాఫీ" చేయాలి.

జనం న్యూస్ 05 సెప్టెంబర్  రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రిపోర్టర్ దినేష్

రైతులందరికీ 2 లక్షల "రుణమాఫీ" చేయాలి.


????ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు మరియు ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 30 వ రోజున జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వారు డిసెంబర్ 4 న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది 7న ప్రమాణస్వీకారం చేస్తాము. డిసెంబర్ 9 వ రోజున సోనియా గాంధీ  జన్మదినం రోజు తెలంగాణలోని రైతులందరికీ 2 లక్షల వరకు ఉన్న క్రాప్ లోన్స్-"రుణమాఫీ చేస్తాం"- అని ఎన్నికల సభలలో మీ ఆరుగ్యారంటీలలో- పెట్టి - ప్రజలను నమ్మించి. అధికారం లోనికి వచ్చిన 8 మాసాలకు, రుణమాఫీ పథకాన్ని మాఫీ చేయడానికి అనేక రకాలుగా కటింగ్స్ మరియు కారణాలను ఏరుగ! పెట్టినారు.అది అర్థంకాక రైతులందరూ రైతు వేదికల చుట్టూ (AO) వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుచున్నారు అది గమనించి మీ ప్రజా ప్రభుత్వం వెంటనే ఎన్నికలలో- ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ "రుణమాఫీ" చేయాలని మండల బిఆర్ఎస్ - పార్టీ పక్షణ డిమాండ్ చేస్తున్నాము.