విజయనగరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

విజయనగరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

జనం న్యూస్ 21 జుల్య్

విజయనగరం టౌన్

గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)

విజయనగరం పట్టణంలోని సంతకాల బ్రిడ్జ్‌ ప్రహరీ గోడ పక్కన చెట్టుకు ఉరివేసుకొని గుర్తు తెలియని వ్యక్తి(50) శనివారం మృతిచెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు కాఫీ, గులాబీ రంగు, నిలువ గీతలతో ఉన్న తెల్ల షర్ట్‌, నీలం రంగు కలిగిన లుంగీ ధరించి ఉన్నాడన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.