వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ప్రియురాలు.. దయచేసి మహిళలు పిల్లలు చూడకండి.

వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ప్రియురాలు.. దయచేసి మహిళలు పిల్లలు చూడకండి.

జనం న్యూస్: ఇటీవల హత్యలు చేసి మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఢిల్లీలో శ్రద్ధావాకర్ ని ఆమె ప్రియుడు హత్య చేసి ముక్కలు చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ మధ్య ఇలాంటి ఘటనలు మరికొన్ని చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా అలాంటి ఘటనే మరొకటి తమిళనాడులోని చైన్నైలో జరిగింది. ఇక్కడ ఓ మాజి ప్రియురాలు తన ప్రియుడ్ని చంపి ముక్కలుగా నరికి పాతిపెట్టింది. వివరాల్లోకి వెళ్తే చెన్నైకి చెందిన జయన్తన్.. చెన్నై విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే మార్చి 18 నుంచి జయన్తన్ కనబడటం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు జయన్తన్ తో చివరిసారిగా అతని మాజీ ప్రియురాలు భాగ్యలక్ష్మీతో మాట్లాడినట్లు గుర్తించారు. ఆమె దగ్గరికి వెళ్లి తమ రీతిలో విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. అయితే ఇద్దరి మధ్య గొడవ కావడంతో జయన్తన్ ను హత్య చేసినట్లు భాగ్యలక్ష్మీ ఒప్పుకుంది. అనంతరం అతడ్ని ముక్కలు ముక్కలుగా నరికి చెన్నై శివార్లలోని కొవళం బీచ్ లో పాతిపెట్టినట్లు తెలిపింది. గతంలోనే జయన్తన్ ను వివాహం చేసుకున్నానని.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అతను ఆమెను దూరం పెట్టాడని పేర్కొంది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య ఘర్షణ జరిగినట్లు విచారణలో వెల్లడించింది.