శివంపేట మండలంలో పురాతన కట్టడాలను పరిరక్షించండి

శివంపేట మండలంలో పురాతన కట్టడాలను పరిరక్షించండి

బీజేవైఎం మండల అధ్యక్షులు గూడూరు బల్కంపేట భాస్కర్....


కోటలు, బురుజులను బావి తరాలకు అందించాలని అధికారులకుబల్కంపేట భాస్కర్ విజ్ఞప్తి..


 జనం న్యూస్ అక్టోబర్19.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్


 మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పురాతన కట్టడాలను బావితరాలకు ఒక కానుకగా అందించాలని బీజేవైఎం శివంపేట  మండల అధ్యక్షులు గూడూరుబల్కంపేట భాస్కర్ అన్నారు. శనివారం  శివ్వంపేటలో బల్కంపేట భాస్కర్ మాట్లాడుతూ మండల కేంద్రమైన శివ్వంపేటలోని మండల పరిషత్ కార్యక్రమం వద్ద గల పురాతన కట్టడాలైన బురుజులు, మండలంలోని దొంతి, కొంతాన్ పల్లి, పోతులబోగూడ,అల్లీపూర్, రత్నాపూర్, ఎదుల్లాపూర్, గోమారం గ్రామాలలో గత వైభవాలకు చిహ్నలుగా నిలిచి, ప్రస్తుతం శితిలావస్థలో ఉన్నటువంటి కోటలు, బురుజులు, చారిత్రాత్మక కట్టడాలకు ప్రభుత్వం తక్షణమే మరమ్మత్తులు చేయించి, వాటిని సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది, భావితరాల భవిష్యత్తుకు కానుకగా అందజేయాలనీ ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రాచీన, చారిత్ర కట్టడాలకు మారుపేరుగా నిలిచిన గ్రామానికే పురాతన ఆస్తులుగా మిగిలిన బురుజులకు అవసరమైన మరమ్మత్తులను తక్షణమే చేయించాలని జిల్లా కలెక్టర్, మండల అధికారులకు గూడూరు  బల్కంపేట భాస్కర్ విజ్ఞప్తి చేశారు.