అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల ఉద్యోగాలు కొనసాగిస్తామని తీర్మాణం చేయాలి.

అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల ఉద్యోగాలు కొనసాగిస్తామని తీర్మాణం చేయాలి.

-ఎఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్
జనం న్యూస్ 22 అక్టోబర్ 
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని కేబినెట్ సమావేశాలు జరిగినా వాలంటీర్లు కోసం అందులో చర్చ జరపకపోవడం చాలా బాధాకరమని ఎఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.వాలంటీర్లుకి ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని సోమవారం ఉదయం విజయనగరంలో ఎ.పి గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) అధర్యంలో జిల్లా కన్వీనర్ రవీంద్ర, కో- కన్వీనర్ అచ్యుత కుమారి ల నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించి కలక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ గార్కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఆయన స్పందించి ఈ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకునీ వెళ్ళి మీకు న్యాయం జరిగేలా చూస్తాను అని చెప్పారు.ఈ సందర్భంగా బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ 2019 లో సచివాలయ వ్యవస్థ కంటే ముందుగానే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులను వాలంటీర్లుగా నియమించి వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేడయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా సేవలు చేయడం జరిగిందనీ అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తె వాలంటీర్లను కొనసాగిస్తాం అని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం వలన వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారు అని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల అరవై వేల మంది వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు వాలంటీర్లు అందరికీ న్యాయం చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళకి గురి చేసిన కూటమి ప్రభుత్వం గెలుపుకోసం వారి వంతుగా కృషి చేసిన వాలంటీర్ల ఆశల్లో నీళ్ళు చల్లకుండ వారి ఆవేదన అర్థం చేసుకుని ఉద్యోగాల్లో కొనసాగించాలన్నారు. 5 నెలలుగా ప్రభుత్వం నుండి గౌరవ వేతనం కూడా చెల్లించకపోతే ఎందరో మహిళలు ఆ గౌరవ వేతనం మీదే కుటుంబంలో కొంత ఆర్థక ఇబ్బందులను నెట్టుకొస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో అటెండెన్స్ కూడా వేసుకొనే అవకాశం కల్పించడం లేదనీ అన్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్స్ అందరికి న్యాయం చేస్తామని నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం పెంచి ఇస్తామని వాలంటీర్లు అందరికి సమాజంలో మంచి గుర్తింపు గౌరవం వుండే పద్ధతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని మరిచిపోవద్దు అని గుర్తు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో గత ప్రభుత్వ రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి బలవంతపు రాజీనామాలు చేయించడం వల్ల చాలా మంది వాలంటీర్స్ ఒత్తిళ్ళకి తట్టుకోలేక బలవంతంగా రాజీనామాలు చేసారనీ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరచిపోకుండా వాలంటీర్స్ అందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇప్పించాలని, గత నాలుగు నెలలుగా బకాయి ఉన్న గౌరవ వేతనాన్ని విడుదల చేయించాలని, రాజకీయ ఒత్తిళ్లుతో రాజీనామా చేసిన వాలంటీర్లను మన్నించి తిరిగి విదుల్లో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ ఉద్యోగాల్లో చేరిన వాలంటీర్ అందరి భవిష్యత్తుకు భరోసా కల్పించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు మరియు విజయనగరం 60 సచివాలయల నుంచి జిల్లాలో మండలాల నుంచి వాలంటీర్లు పాల్గొన్నారు.